ఇండియాలోనే అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా పేరొందిన బాలీవుడ్ గత కొద్ది నెలల నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సరైన హిట్ లేక బాలీవుడ్ అంతలాకుతలం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు.. రణబీర్ కపూర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఇందులో రియల్ కపుల్ అయిన రణబీర్ కపూర్, అలియా భట్ హీరో-హీరోయిన్లుగా నటించారు. అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనిక రాయ్ ముఖ్య పాత్రలను పోషించారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను నార్త్ తో పాటు సౌత్లో విసృతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబరు 2న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు రామోజీ ఫిలిం సిటీ వేదిక కాబోతోంది. అయితే ఈ ఈవెంట్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర టీమ్ కన్ఫామ్ చేసింది. మరోవైపు ముఖ్య అతిథిగా వస్తున్న ఎన్టీఆర్ కి నాగార్జున సైతం ప్రత్యేక ఆహ్వానం పలికారు. ట్విట్టర్ వేదికగా సెప్టెంబరు 2న నిన్ను కలవాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ వైరల్గా మారింది.
Looking forward to seeing you on sept 2 @tarak9999 !! 😊👍 https://t.co/rIYpqhwZPO
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 27, 2022