Mahesh Rajamouli: బాహుబలి, RRR లతో దర్శకుడిగా రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించడం తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారతీయ చలనచిత్ర రంగంలో ₹1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు రాజమౌళి తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయటానికి రెడీ కావడం సంచలనంగా మారింది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ప్రపంచ సాహస వీరుడుగా సినిమాలో మహేష్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ దీపికా పదుకొనే నీ తీసుకోవడానికి రాజమౌళి ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నెట్ లో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. మరి సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి, RRR సినిమాల కంటే హై బడ్జెట్ దాదాపు ₹800 కోట్ల రూపాయలతో మహేష్ సినిమా నిర్మాణం జరుగుతుందని సమాచారం.
అంతేకాదు అత్యధిక భాషల్లో కూడా విడుదల చేసే విధంగా రాజమౌళి మరియు నిర్మాతలు ప్లాన్ చేసినట్లు టాక్. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి.. విజువల్ వర్క్స్ మొత్తం కూడా ఓ ఇంటర్నేషనల్ కంపెనీ చేతిలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్… త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. నవంబర్ నెలలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి ప్రాజెక్టు మహేష్ స్టార్ట్ చేయనున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!