ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సమంత `ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా` అనే ఐటమ్ సాంగ్ చేసి ఓ ఊపు ఊపేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 `పుష్ప ది రూల్` సినిమా రాబోతోంది.
ఈ మూడీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. పుష్ప 1 లో మాదిరిగానే పుష్ప 2 లోనూ ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుందట.
అయితే ఆ సాంగ్ కోసం బాలీవుడ్కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ను రంగంలోకి దింపుతున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా. ఇందులో భాగంగానే సుకుమార్ టీమ్ ప్రియాంక చోప్రాతో సంప్రదింపులు సైతం షురూ చేశారట. మరి ఆమె ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు.