Brahmamudi: అప్పు, కళ్యాణ్ లు సీక్రెట్ కలుసుకుంటారు.. కావ్య, రాజ్ ల గురించి మాట్లాడుటారు.. వారిద్దరూ విడిపోకూడదు.. అంటే మనం స్వప్న వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరోనని ప్లాన్స్ వేస్తారు.. ఏం చెయ్యాలి స్వప్న కు పెళ్లి చూపులు చేస్తే అతడు ఎవడో బయటకు వస్తారని ప్లాన్ చేస్తారు అయితే మా అమ్మ తెలిసి ఆ పనిచేయదు కదా.. ఎలా అంటుంది.. అప్పుడు కళ్యాణ్ మీ కాలనిలో వాళ్ళు అందరూ మీ అమ్మకు బాగా క్లోజ్ కదా.. అలా తెప్పిద్దాం అంటాడు.. అవును నువ్వు చెప్పింది నిజమే.. అదే బెస్ట్ అని అనుకుంటారు.. అలాగే అని ఇద్దరు బయలు దేరతారు.. ఇక కావ్య ఇంట్లో అందరి కోసం వంట చేస్తుంది.. అందరూ బాగున్నాయి అంటూ లోట్టలు వేసుకుంటూ తింటారు… ఇక అపర్ణ వస్తుంది.. స్మెల్ తోనే కడుపు నిండుతుంది.. తింటే ఎలా ఉంటుందో నని అంటుంది..
Brahmamudi: కావ్యను అపర్ణ కోడలుగా ఒప్పుకుందా.. అప్పు, కళ్యాణ్ రాహుల్ గుట్టు బయట పెడతారా..
అప్పుడే ఇంద్రాణి నీ కోడలు మొదటిసారి వంట చేసింది చాలా రుచిగా ఉన్నాయి.. నువ్వు కూడా తిను అంటుంది.. అందరికి నచ్చాయి అంటుంది.. ఏంటి నువ్వు వంట చేసావా.. నిన్ను అస్సలు వంట గదిలోకి వెళ్ళొద్దని చెప్పాను.. నువ్వెందుకు వెళ్లవు.. అత్తగా ఆర్డర్ వేసాను నువ్వు ఎందుకు వెళ్ళావు.. అని మీనాక్షిని చూస్తే కోపంతో రగిలి పోయింది.. శాంతా రాలేదు మీనాక్షి ఒకటే చేసుకోలేదు.. అందుకే నేనే వెళ్ళమని చెప్పాను అని ఇంద్రాదేవి అంటుంది..
శాంతా రాకుంటే నన్ను పిలవాల్సింది అంటే ఇప్పుడేం అయ్యింది ఈరోజుకు తిను అంటే నేను తినను అసలు అత్తగా ఆర్డర్ వేస్తే నువ్వు ఎందుకు వెళ్ళావు అని అపర్ణ కావ్యను అరుస్తుంది.. అత్తగా చెప్పిన వినవా అంటే అప్పుడే కావ్య అత్తగా అంటే నన్ను కోడలిగా ఒప్పుకున్నారా అంటే అది ఈ జన్మలో జరగదు అని వెళ్ళిపోతుంది… ఇక అప్పుడు ప్లాన్ ను అమలు పరుస్తుంది..
Krishna Mukunda Murari: మురారి, కృష్ణకి తిండి లేకుండా చేసిన భవాని.! రేపటికి సూపర్ ట్విస్ట్..
కాలనీలో ఉన్న ఆడవాళ్లకు స్వప్న గురించి నిజం చెబుతుంది.. స్వప్న వచ్చింది కదా అని చెప్పి వెళ్తుంది.. వాళ్లంతా స్వప్నను అడగాలని అనకుంటారు.. ఇక అపర్ణ ఆకలి కోసం కావ్య ఫుడ్ ఆర్డర్ పెట్టి రాజ్ వాళ్ల నాన్నకు ఇస్తుంది.. ఆ అన్నాన్ని లోట్టలేసుకుంటూ తింటుంది.. ఇకపోతే కావ్య అందరిని బుట్టలో వేసుకుంటుంది.. లెమన్ టీ తీసుకొచ్చి ఇస్తుంది.. భోజనం తర్వాత ఈ టీ తాగితే అరుగుతుంది అని అంటుంది.. టీ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటారు..
Nuvvu nenu prema: అరవింద గర్భవతి అవ్వడంతో షాక్ లో కృష్ణ.. విక్కీకి పద్మావతి నిజం చెప్తుందా?
ఆ తర్వాత రాజ్ కు కూడా టీ ఇవ్వాలని చూస్తే తను మోహం కూడా చూడకుండా పోతాడు.. ఇక తరువాయి భాగంలో ఇంద్రాదేవి మనవడికి శోభనం జరగాలని పంతులును పిలిపించి పూజకు సిద్ధం చేస్తుంది.. ఇక రాజ్ నువ్వు ఎంతగా అనుకున్నా కూడా నీకు ఇచ్చిన గడువు లోపు నీ తప్పు లేదని నిరూపించుకో లేదా బయటకు పంపిస్తాను అని అంటాడు.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..