నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఈ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. దునియా విజయ్ విలన్గా చేస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య కెరీర్లో ఇది 107వ చిత్రం కావడంతో.. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో గత ఏడాది ప్రారంభించారు. కొద్ది నెలల క్రితమే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటికే అరవై శాతానికి పైగా షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది.
ప్రస్తుతం కర్నూల్లోని కొండారెడ్డి బురుజు, మౌర్యహోటల్ సెంటర్ వద్ద వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. సినిమాకు హైలెట్గా నిలువబోయే ఈ షూట్ షెడ్యూల్లో కీలక నటీనటులు పాల్గొన్నారు. అయితే, తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చింది.
ఇదో సెల్ఫీ పిక్. ఈ ఫోటోలో బాలయ్య తన సహా నటీమణులతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీనా వాసు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అయితే ఈ పిక్లో సహా నటీమణులు బాలయ్యతో సెల్ఫీ తీసుకుంటుండగా.. వెనక నుండి శ్రుతి హాసన్ వెక్కిరిస్తూ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CgbpnIkPMaf/?utm_source=ig_web_copy_link