“RRR” విజయంతో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు “రంగస్థలం” సినిమాతో నటనపరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో… మంచి క్రేజ్ తెచ్చుకున్న చరణ్ ఉన్నాకొద్ది తన మార్కెట్ విస్తరించేలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో తమిళ దర్శకులపై ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం చరణ్ తన కెరియర్ లో 15వ సినిమా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొన్నటి వరకు చాలా శరవేగంగా సాగింది. మధ్యలో తెలుగు సినిమా రంగంలో సినీ కార్మికులు షూటింగ్ లు బంద్ ప్రకటించటంతో “RC 15” ఆగిపోయింది. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్ మొదలుకానింది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకుండానే మరో తమిళ దర్శకుడు పై చరన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ‘ఖైదీ’ .. ‘మాస్టర్’ .. ‘విక్రమ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ లు తెకెక్కించిన లోకేష్ కనకగారజ్ పేరు ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతుంది.
సీనియర్ హీరో కమలహాసన్ నీ “విక్రమ్” సినిమాలో చూపించిన విధానం .. ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా ఈ సినిమా తమిళ సినిమా రంగంలో “బాహుబలి” రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..లోకేష్ కనకగారజ్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం స్టోరీ కి సంబంధించి డిస్కషన్ జరుగుతున్నట్లు టాక్ ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తోంది. తాజా పరిణామాలు బట్టి చూస్తే చరణ్.. దక్షిణాది సినిమా రంగంలో ఎక్కువగా తమిళ ఇండస్ట్రీనీ గట్టిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!