టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకోండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `లైగర్`.. ఇటీవల గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది.
బాక్సీంగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. విడుదలకు ముందు ఈ మూవీపై వేరె లెవల్లో బిల్డప్ ఇచ్చారు. కానీ, లైగర్ సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. ఈ మూవీ డిజాస్టర్ అవ్వడంతో విజయ్ దేవరకొండతో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
దీనికి తోడు వీరి నెక్స్ట్ అయిన `జనగణమన` కూడా ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఛార్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆమె డిసైడ్ అయింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. `చిల్ గాయ్స్. సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది.
అప్పటి వరకు బ్రతకండి. బ్రతకనివ్వండి’ అంటూ ఛార్మీ తన ట్వీట్లో రాసుకొచ్చింది. ఈ ట్వీట్తో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. ఈసారి అయినా అతి చేయకుండా సినిమా తీయండి అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better…
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022