`ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇది ఆయనకు 30వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితం కానుంది.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా ఖరారు అయినట్లు టాక్ నడుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ షూటింగ్ విషయంలో ఎప్పటి నుంచో సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఏడాదే ఈ చిత్రాన్ని ప్రకటించారు.
కానీ, ఇప్పటి వరకు షూటింగ్ను ప్రారంభించలేదు. అయితే తాజాగా ఈ మూవీ విషయంలో తారక్ ఫ్యాన్స్ దారుణంలో మోసపోయారు. అసలేమైందంటే.. యువసుధ ఆర్ట్స్ ట్విట్టర్ పేజీలో `ఎన్టీఆర్ 30 కింగ్ ఆన్ ద వే.. చాలా కాలం వెయిట్ చేయించినందుకు క్షమించండి.. ఇక టైమ్ వచ్చేసింది.. మరో రెండు రోజులలో బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతోంది. రెడీగా ఉండండి. అగ్నిపర్వతం బద్దలయ్యేందుకు సిద్ధం` అంటూ పోస్ట్ పెట్టారు.
ఈ పోస్ట్తో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. మరో రెండు రోజుల్లో రాబోయేది షూటింగ్ అప్డేట్నే అని తెగ సంభరపడిపోయారు. కట్ చేస్తే.. ఈ పోస్ట్ ఒక ఫేక్ అకౌంట్ ద్వారా వచ్చిందని పలువురు నెటిజన్లు గుర్తించారు. అయితే సరిగ్గా చూస్తే తప్ప ఇది ఫేక్ అకౌంట్ అని అనిపించనంతగా.. ఈ ట్వీట్ ఉండటం విశేషం. మొత్తానికి అలా ఫేక్ అకౌంట్ ద్వారా వచ్చిన ఫేక్ పోస్ట్తో తారక్ ఫ్యాన్స్ మోసపోయారు.