Bhola Shankar: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరోలలో చిరంజీవి ప్రధమంగా ఉన్నారు. గత ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో “ఆచార్య” అక్టోబర్ నెలలో “గాడ్ ఫాదర్” రిలీజ్ అయ్యాయి. రెండిటిలో “గాడ్ ఫాద”ర్ సూపర్ డూపర్ హిట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది స్టార్టింగ్ లోనే “వాల్తేరు వీరయ్య” సినిమా రిలీజ్ చేసి సంక్రాంతి హిట్ అందుకోవటం తెలిసిందే. చిరంజీవి రవితేజ కలిసి నటించిన ఈ సినిమా… టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సాయి వసూలు రాబడుతుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తరహాలో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న “వాల్తేరు వీరయ్య” తొలి మూడు రోజుల్లోనే ₹100 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. 9 రోజుల్లో ₹182కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
దీనిలో ₹106 కోట్ల రూపాయల షేర్ ఉన్నాయి. నైజాంలో ₹28.87కోట్లు, సీడెడ్ లో ₹15.30 కోట్లు, ఉత్తరాంధ్రలో ₹13.24కోట్లు, గుంటూరు ₹6.72 కోట్లు… యూఎస్ లో 2 మిలియన్ కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఇప్పటికీ కూడా థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజులకే మళ్ళీ తన నెక్స్ట్ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న “బోలా శంకర్” ప్రాజెక్టులో చిరంజీవి జాయిన్ అయిపోవడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు సగం కంప్లీట్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని నిర్మాతలు మొదట డిసైడ్ కావటం జరిగింది.
అయితే ఇప్పుడు అనుకున్న తేదీ కంటే నెలరోజుల ఆలస్యంతో అనగా మే నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం. “బోళ శంకర్” సినిమా నిర్మాత అనిల్ సుంకర.. అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” కూడా నిర్మించడం జరిగింది. ఇప్పటికే “ఏజెంట్” అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈసారి ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. “ఏజెంట్” రిలీజ్ విషయంలో నాగార్జున కూడా కలుగజేసుకుని “బోళ శంకర్” నెల రోజుల తర్వాత రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. దీంతో చిరంజీవి…నాగ్ కోరిక మేరకు వెనక్కి దిగి మే నెలలో “బోళ శంకర్” రిలీజ్ కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!