మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు నేడు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. స్పెషల్ ఏంటి.. ఈరోజు ఆయన పుట్టిన రోజు కాదు. పోని పెళ్లి రోజా అంటే కానే కాదు. కానీ ఆయన తొలి సినిమా `చిరుత` సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలైంది. అంటే రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న `చిరుత` సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్వహించారు. ఇందులో రామ్ చరణ్, నేహా శర్మ జంటగా నటించారు. 2007 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తొలి సినిమాతోనే అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న రామ్ చరణ్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇకపోతే రామ్ చరణ్ ఇండస్ట్రీలో 15 ఏళ్ల కెరీర్ను పూర్తి చేసుకోవడంతో.. ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
“సినిమాల్లో రామ్ చరణ్ పదిహేను ఏళ్ళ మైలు రాయి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. `చిరుత` నుంచి `మగధీర`, `రంగస్థలం`, `ఆర్ఆర్ఆర్`, తాజాగా డైరెక్టర్ శంకర్తో `ఆర్సీ 15` వరకు చరణ్ తనని తాను మార్చుకుంటూ ఎదిగిన తీరు ఎంతో బాగుంది. తన వర్క్, డెడికేషన్ అన్నీ చూస్తుంటే సంతోషంగా, గర్వంగా ఉంది. చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నువ్వు సాధించాల్సినవి ఇంకా ఉన్నాయి. వాటి వైపు అడుగు వెయ్యి. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావ్..“ అంటూ చిరు ట్వీట్ చేశారు. దాంతో ఆయన ట్వీట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
https://twitter.com/KChiruTweets/status/1575028648478134272?s=20&t=0FbQqZKemf4I5L3Bl_jH-w