మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం ఇటీవల `గాడ్ ఫాదర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన `లూసిఫర్`కు ఇది రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా పలు మార్పులు చేర్పులు చేసి తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు. ఇందులో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. గాడ్ ఫాదర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది.
అయితే థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అవడంతో ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ ద్వారా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
https://newsorbit.com/cinema/rajanikanth-appreciates-chiranjeevi-godfather-movie.html