మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `మెగా 154` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. యంగ్ డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మితం అవుతోంది. ఇందులో చిరంజీవికి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుంటే.. రవితేజ సరసన కేథరిన్ థ్రెసా అలరించబోతోంది.
వైజాగ్ జాలరీపేట బ్యాక్డ్రాప్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీరయ్య` అనే టైటిల్ దాదాపు కన్ఫార్మ్ అయిపోయింది. హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిరుతో కలిసి రవితేజ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరిపై బాబీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీకు పెడుతున్న బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ మూవీకి మేకర్స్ రూ. 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. అయితే అందులో రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లు ఖర్చు అవుతుందట.
చిరంజీవికి అటు ఇటుగా రూ.40 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఉంటుంవగ. రవితేజకి రూ.18 కోట్లు, శ్రుతి హాసన్కు రూ. 3 కోట్లు, దర్శకుడు బాబీకి రూ. 6 కోట్లు ఇస్తున్నారని టాక్ ఉంది. ఇక మిగిలిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు కలుపుకొని రూ.75 కోట్లు బడ్జెట్ వరకు అవుతుందట. ఏదేమైనా `ఆచార్య` వంటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా చిరు మూవీకి ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.