Mahesh Chiranjeevi: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి నిన్న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వయోభారం రిత్యా అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా వీల్ చైర్ కి పరిమితమైన ఇందిరాదేవి.. నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో కృష్ణ కుటుంబంలో విషాదఛాయలు అలుమ్ముకున్నాయి. ఇందిరా దేవి మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోలో బంధువులు సన్నిహితుల సందర్శనార్థం కాసేపు ఉంచగా.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలు, రాజకీయ నాయకులు నివాళులర్పించడం జరిగింది.
విజయ్ దేవరకొండ, రానా, సుకుమార్, త్రివిక్రమ్, వెంకటేష్, కొరటాల శివ, బండ్ల గణేష్, మోహన్ బాబు, కీర్తి సురేష్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, మంచు విష్ణు, నాగార్జున..భౌతికకాయానికి నివాళులు ఆర్పించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుక నిన్న అనంతపురంలో జరగటంతో రాలేకపోయారు. కానీ ట్విట్టర్ ద్వారా సానుభూతి ప్రకటించడం జరిగింది. అంతేకాదు “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుక వేదికపై కూడా మహేష్ మరియు కృష్ణకి చిరంజీవి తన సానుభూతి ప్రకటించారు.
అయితే నేడు పద్మాలయ స్టూడియోలో మహేష్ మరియు కృష్ణనీ చిరంజీవి పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఇందిరా దేవి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మరియు కృష్ణనీ చిరంజీవి పరామర్శించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే సందర్భంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.