సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. కానీ అవి నెట్టింట చేసే రచ్చ అంతా కావు. తాజాగా మరొక నటి విడాకుల వార్తలు సైతం సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇంతకీ ఆ నటి మరెవరో కాదు ప్రియమణి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు చక్రం తిప్పిన ఈ అమ్మడు.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి జోరు చూపిస్తుంది.
అయితే ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్ కు విడాకులు ఇవ్వబోతోందని, ఇప్పటికే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలు కేవలం పుకార్లే అని తాజాగా తేలిపోయింది. రీసెంట్గా `రాకెట్రీ` సక్సెస్ మీట్ పార్టీకి ప్రియమణి తన భర్తతో కలిసి హాజరు అయింది.
ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ప్రియమణి దంపతులు ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రియమణి ఆమె భర్త ముస్తఫా విడిపోవడం లేదు అనడానికి ఇంతకంటే క్లారిటీ ఇంకేం కావాలి. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 2017లో ముస్తఫా రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముస్తఫా కు ఇది రెండో వివాహం. ఆయన మొదటి భార్య పేరు ఆయేషా. అయితే ఆమె ఇప్పటికీ ప్రియమణితో ముస్తఫా వివాహం చెల్లదని న్యాయపోరాటం చేస్తుంది. అయినాసరే ప్రియమణి తన భర్తకు అండంగా నిలుస్తూ వస్తోంది.
https://www.instagram.com/reel/ChCaOE1gXh8/?utm_source=ig_web_copy_link