టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
దసరా అనంతరం రెండో షెడ్యూల్ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే త్రివిక్రమ్ ఈ సినిమా కోసం `అయోధ్యలో అర్జునుడు` అనే క్రేజీ టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ మహేష్ బాబు తో పాటు చిత్ర టీం మొత్తానికి నచ్చడంతో దీనినే ఖరారు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు `అయోధ్యలో అర్జునుడు` టైటిల్ పట్ల మహేష్ అభిమానులు సైతం సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టైటిల్ నే ఖరారు చేస్తారా..? లేక మరో టైటిల్ వైపు మొగ్గు చూపుతారా..? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా, త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇంతకుముందు వీరిద్దరూ అతడు, ఖలేజా చిత్రాల కోసం కలిసి పనిచేశారు. ఈ చిత్రాలు కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా.. ప్రేక్షకులను బాగానే అలరించాయి. దీంతో వీరి తాజా ప్రాజెక్టు పై సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నారు.
https://twitter.com/haarikahassine/status/1569317909071278080?s=20&t=iczLbiGFm7hTDgObbCCVag
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!