Devatha: చిన్మయి ఆదిత్య కి ఫోన్ చేసి దేవి ఈరోజు అన్నం తినలేదు.. మీరు ఒకసారి దేవితో మాట్లాడాలి అని చెబుతుంది.. సరే ఇప్పుడే ఫోన్ ఇవ్వు మాట్లాడతాను అని అంటాడు.. ఇప్పుడు కాదు సార్ రేపు స్కూల్ దగ్గరికి రండి నేను ప్రభుత్వ మాట్లాడి ఇస్తాను అని చిన్మయి అంటుంది. తప్పకుండా వస్తారు కదా అని అడుగుతుంది. నువ్వు దేవీ బాగోలేదు అని చెప్పాక కూడా నేను రాకుండా ఉంటాను అని ఆదిత్యా అంటాడు..
ఆదిత్య కొన్ని సంవత్సారాలు బాధలో ఉన్నప్పుడు సత్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అలాంటి సత్య ఇప్పుడు ఆదిత్య ను ప్రశ్నిస్తుంది.. అంటే వీళ్ళిద్దరి మధ్య న మూడో వ్యక్తి పమేయం ఉందా.. ఆసలు ఏమైంది వీళ్ళకి బయట ఎక్కడో ఏదో జరిగింది. అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అని దేవుడమ్మ తన భర్త తో అంటుంది.
మాధవ్ రాధ ను అదోలా చూస్తాడు అదంతా భాగ్యమ్మ గమనిస్తుంది బిడ్డ ఆయమ్మ రూమ్ లో ఒక్కతే ఉంది ఆమె సంగతి ఏంటో చూడు అని పంపిస్తుంది భాగ్యమ్మ కాఫీ కప్పు తీసుకొని మాధవ్ దగ్గరకు వెళుతుంది మాధవకు ఇస్తున్నట్టే ఇచ్చి వేడి వేడి కాఫీని తన మీద పడేస్తుంది మాధవ్ కోపంగా వేడి వస్తువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదా అని అరుస్తాడు భాగ్యమ్మ అటు ఇటు చూసుకొని ఏరా నకరాలు చేస్తున్నావా.. నా కండ్లు కాదు నీ కండ్లు నెత్తికెక్కయి.. అందుకే ఇలాంటి గలీజ్ పనులు చేస్తున్నావు.. ఏంటి నోరు లెగుస్తుంది అని మాధవ్ అంటాడు.. నువ్వు చేసే పనులకి నోరు కాదు.. చెయ్యి లెగుస్తుంది అని భాగ్యమ్మ మాధవ్ కి చెయ్యి చూపిస్తుంది.. సక్కంగా ఉన్నొడివి సక్కంగా ఉండకుండా దానిని బాధపడుతున్నావు నేను ఎవరిని అనుకుంటున్నావో దాని తల్లిని.. నా బిడ్డని నువ్వు అలా కష్టపెట్టాలని చూస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా.. అని మాధవ్ కి భాగ్యమ్మ వార్నింగ్ ఇస్తుంది..