Devatha: రుక్మిణి, ఆదిత్య ఇద్దరు వేణుగోపాలస్వామి గుడికి దీపాలు వెలిగించడానికి వస్తారు.. మరోవైపు వాళ్ళిద్దరి కంటే ముందే దేవి ఆ గుడికి చేరుకుంటుంది.. దేవుడా ఈరోజు ఎలాగైనా సరే మా అమ్మ నాన్నలని నాకు చూపించు.. నేను నిన్ను తప్ప ఇంకా ఎవరిని ఈ కోరిక కోరలేను.. ఈరోజు ఎలాగైనా మా నాన్న కనిపించేలాగా చేయమని దేవి శివాలయంలో దేవుడికి మొక్కుకుంటుంది..
మరోవైపు రుక్మిణి దీపాలు వెలిగిస్తూ ఉండగా.. ఆదిత్య మెట్లు మీద కూర్చుని ఉంటాడు.. రుక్మిణి ఆనందంగా దీపాలు వెలిగిస్తూ ఉంటుంది.. ఇక దూరంగా ఉన్న దేవి తన తండ్రి ఎవరో చూడాలని రుక్మిణి దీపాలు వెలిగిస్తున్న చోటకి సీక్రెట్ గా వస్తుంది.. వాళ్ళ అమ్మ దీపాలు పెడుతుంటే.. పైన కూర్చున్న ఆదిత్యను చూస్తుంది దేవి.. అంటే అమ్మ తన పెనిమిటితో దీపాలు వెలిగించామని సోది అమ్మ చెప్పింది.. అమ్మ వెంటనే నాన్నకి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పింది..
అంటే కచ్చితంగా మా నాన్న ఆఫీసర్ సారైనా ఆఫీసర్ మా నాన్ననా అని దేవి మనసులో అనుకుంటుంది.. ఆదిత్య తో అంతకుముందు జరిగిన సన్నివేశాలన్నింటినీ గుర్తు చేసుకుంటుంది దేవి.. ఇక వెంటనే దేవుడికి దండం పెట్టుకోవడానికి మళ్లీ గుడిలోకి వెళ్తుంది దేవి.. నీవల్లే నాకు మా నాన్న ఎవరో తెలిసింది… ఇకనుంచి మేము ముగ్గురం కలిసి ఉండేలాగా చేయమని ఆ దేవుడికి మొక్కుకుంటుంది దేవి..
మరోవైపు రుక్మిణి దీపాలు పెడుతుంటే పైన కూర్చున్న ఆదిత్యను చూసి మీరు ఇద్దరు ఎంత సంతోషంగా ఉంటే.. నేను ఎలా చూస్తూ ఊరుకుంటాన.. మీరు ఇక్కడ దీపాలు వెలిగిస్తే నేను మీకు దీపం ఎక్కడ వెలిగించాలో నాకు బాగా తెలుసు అని మాధవ్ సత్యకు ఫోన్ చేస్తాడు.. నేను నీకు ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు సత్య.. కానీ చెప్పక తప్పడం లేదు.. నా భార్య నీ భర్త ఇద్దరు కలిసి గుడిలో దీపాలు వెలిగిస్తున్నారు అని సత్యకు చెబుతాడు మాధవ్..
ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయినా మాధవ్ ఫేస్ వాష్ చేసుకోనుకుంటూ ఉండగా.. చేతి మీద ఉన్న దేవి అనే పచ్చబొట్టు చెరిగిపోతుంది.. వెంటనే ఈ తప్పుని సరిదిద్దుకోవాలని.. తన రూమ్ లోకి వెళ్లి స్కెచ్ పెన్ తీసుకొని దేవి పేరు రాసుకుంటూ ఉంటాడు.. చాటుగా ఈ విషయాన్ని చిన్మయి చూస్తూ ఉంటుంది.. రాధ నాకు మాత్రమే సొంతం కావాలి.. తను నాకు సొంతం అవడానికి ఏదైనా చేస్తాను అంటూ.. మాధవ్ ఇప్పటివరకు చేసిన అన్ని కుట్రలను తను బయటికి చెబుతూ ఉండగా చిన్మయి షాక్ అవుతుంది..