Devatha: జానకమ్మ కి రాధా దగ్గరుండి సేవలు చేస్తుంది.. తనకు టైం టు టైం మెడిసిన్ వేస్తూ జావా తాపిస్తుంది.. అది చూసిన రామ్మూర్తి చలించిపోతాడు రాధకి రెండు చేతులు ఎత్తి.. నమస్కరిస్తాడు రాముర్తి.. ఆయన దండం పెట్టడం చూసి రాధ మీరేంది నాకు దండం పెడతారు.. మా అమ్మకి బాగోకపోతే ఇలా సేవలు చేయనా అని రాధ అంటుంది.. జానకమ్మ రాధకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది.. అది ఎలా చెప్పాలో రాధ ఎలా అర్థం చేసుకోవాలి తెలియక సతమతమవుతారు..!!
అప్పుడే చిన్మయి ఒక నోట్ బుక్ తీసుకొచ్చి దానిమీద నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు నానమ్మ. అది రాయమని చిన్మయి అంటుంది.. అది గమనించిన మాధవ్ రాదా ఇప్పుడు అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటాడు.. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది రాయమని చిన్మయి వాళ్ళ నాన్నమ్మను ఒత్తిడి చేస్తుంది.. అంతలో దేవి ఆదిత్య , ఇద్దరు డాక్టర్ని తీసుకుని వాళ్ళింటికి వస్తారు.. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు డాక్టర్.. మా అవ్వ త్వరగా లేచి మాతో మళ్ళీ కబుర్లు చెప్పాలి అని దేవి అంటుంది.. డాక్టర్ జానకమ్మ రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత తను వారం రోజుల్లోనే బాగుంటుంది అని చెబుతుంది.. తన ఆరోగ్యం నయం అయ్యే బాధ్యత నాది అని అంటుంది డాక్టర్.. ఆ మాట విని మాధ షాక్ అవుతాడు.
మరోవైపు సత్య దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అది దేవుడమ్మ గమనిస్తుంది వెంటనే సత్యను ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని దేవుడమ్మ అడుగుతుంది.. ఆదిత్య గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది.. కాదు ఆంటీ రాధ గురించి ఆలోచిస్తున్నాను.. వాళ్ళింట్లో అంతమంది ఉండగా.. ఆదిత్యను డాక్టర్లు తీసుకు రమ్మని అడగడం ఏంటి అని అడుగుతుంది..
ఆదిత్య కూడా ముందు గనక ఆలోచించకుండా అలా పరుగులు తీయడం ఏంటి అని అడుగుతుంది.. వాళ్ల మీద అంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఆదిత్య కేంటి అని.. ఆదిత్య కు ఏం అవసరం ఉంది అని సత్యా అంటుంది.. అదేంటి సత్య అలా మాట్లాడుతున్నావు అని దేవుడమ్మ అంటుంది.. ఏంటమ్మా ఆదిత్య ఎవరో పెద్ద డాక్టర్ని తీసుకువస్తాడు నీకు నయం అయిపోతుంది అంటే సంతోషిస్తున్నావా.. మాట రాగానే అందరి ముందు నిజం చెప్పేసేసి.. నన్ను దుర్మార్గుడిని చేయాలని చూస్తున్నావా..