Devatha: చెప్పు ఆదిత్య నువ్వు నాతో పాండిచ్చేరి కూడా రాకుండా ముఖ్యమైన క్యాంప్ అని వెళ్ళింది.. ఇక్కడికే కదా అని సత్య ఆదిత్య ను రాధతో కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తూ అడుగుతుంది.. ఆ ఫోటోలో ఉన్నది నువ్వు కాదా.. అక్కతో ఆశ్రమం కి వెళ్ళింది నువ్వు కదా.. నువ్వు దేని గురించి ఆలోచిస్తూ నన్ను దూరం పెడుతున్నావ్ అని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ అది అబద్ధం.. నువ్వు కావాలనే నన్ను దూరం చేసుకుంటున్నావు.. నువ్వు వెళ్ళినందుకు నాకు బాధగా లేదు ఆదిత్య కట్టుకున్న భార్యకు అబద్ధం చెప్పావు చూడు అందుకు బాధగా ఉంది అని సత్య అంటుంది..
జానకమ్మ రాదను దేవిని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెబుతుంది. నాకు ఇంత సహాయం చేసిన నిన్ను ఇంత కష్టంలో వదిలిపెట్టి వెళ్లడం నాకు ఇష్టం లేదు.. మీకు నయం అయ్యేవరకు నేను ఎక్కడకు వెళ్ళను అని రాధ అంటుంది.. ఆ మాటలు విన్న మాధవ్ హమ్మయ్య రాధ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అని అనుకుంటాడు.. అయితే నేను అమ్మ మీద ఇక ఎలాంటి ప్లాన్స్ అవసరం లేదు నిదానంగా నా ప్లాంట్స్ నేను వేసుకుంటాను అని మాధవ్ మనసులో అనుకుంటాడు..
మరోవైపు సత్య ఆదిత్య ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని చూసిన దేవుడమ్మ ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది.. ఇద్దరూ కలిసి ఉండండి అని చెబుతుంది.. రేపు అమ్మవారు గుడిలో మీ ఇద్దరి పేరు మీద పూజ చేయించి మీ చేతుల మీదగా అందరికీ పసుపు కుంకుమ పంచాలి అని అనుకుంటున్నాను అని దేవుడమ్మ చెబుతుంది.. అందరూ రెడీ అయ్యి గుడికి బయలుదేరుతారు.. అప్పుడే ఆదిత్య సత్య ను ఒక కారులో రమ్మని దేవుడమ్మ వాళ్ళు బయలుదేరుతారు.. సత్య ఆదిత్య కార్లో కూర్చుంటుంది.. అప్పుడే ఆదిత్య కు మై లైఫ్ అనే పేరుతో కాల్ వస్తుంది.. సత్య ఆ కాల్ నీ లిఫ్ట్ చేస్తుంది.. కాల్ లిఫ్ట్ చేయగానే పెనిమిటి అని రుక్మిణి అంటుంది.. జానకమ్మని ఇంటికి తీసుకువచ్చాము.. ఆమెకు నయమైపోయింది పెనిమిటి అని మరోసారి అంటుంది.. ఆ మాటలు విన్న సత్య ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది..