Dhoni: మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి అందరికీ సుపరిచితురాలే. ఆమె ఇటీవల స్టొరీ రాయడం జరిగింది అంట. ఆమె రాసిన స్టోరీ ఆధారంగానే ధోని నిర్మాణ సంస్థలో తొలి చిత్రం తెరకెక్కనుందట. అంతేకాదు రమేష్ తమిళ్ మనీ.. డైరెక్ట్ చేయనున్నారట. “సాక్షి రాసిన స్క్రిప్ట్ చదివినప్పుడు. చాలా ఎమోషనల్ అనిపించింది. చాలా వైవిధ్యంగా కథ ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తాను అని రమేష్ తెలియజేయడం జరిగింది. ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ధోనీ భార్య సాక్షి ఈ నిర్మాణ సంస్థకి ఎండీగా వ్యవహరిస్తుంది.
మహేంద్రసింగ్ ధోని ఇండియన్ కెప్టెన్ గా అనేకమైన విజయాలు అందించడం జరిగింది. ధోని ఆధ్వర్యంలో 2011వ సంవత్సరంలో ప్రపంచకప్ అంతకముందు 2007వ సంవత్సరంలో తొలి టీ20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ధోని కెప్టెన్ అయ్యాక ఇండియా టీం చాలా స్ట్రాంగ్ అయింది. అనంతరం కొద్ది సంవత్సరాలు ఆడిన ధోని.. 2020 వ సంవత్సరం ఆగస్టు మాసంలో అన్ని ఫార్మేట్ లకి రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతున్నారు. ఈ క్రమంలో సినిమా రంగంలో ధోని ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది.
తన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఎక్కువగా దక్షిణాది సినిమాలను తెరకెక్కించాలని ధోని బిజినెస్ ప్లాన్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా తన భార్య సాక్షి రాసిన స్టోరీ తో మొదటి చిత్రం తమిళ దర్శకుడితో చేస్తున్నట్లు తాజా పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ఫామిలీ ఎంటర్ టైన్మెంట్ తరహాలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట.