పోయిన శుక్రవారం విడుదలైన `బింబిసార` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో రూపుదిద్దుకున్న సోసియో ఫాంటసీ మూవీ ఇవి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మల్లాడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.అలాగే ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 5న అట్టహాసంగా విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే హిట్ టాక్ను సొంతం చేసుకుంది. గత కొన్నేళ్ల నుండి వరుస ఫ్లాపుల్లో మునిగిపోయిన కళ్యాణ్ రామ్.. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుని బాక్సాఫీస్ వద్ద తన దాహాన్ని తేర్చేసుకుంటున్నారు.
కళ్యాణ్ రామ్ కెరీర్లో ఈ మూవీ ఓ మైల్ స్టోన్గా నిలుస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. రూ. 16.20 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లో 25 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి ఇప్పుడు 30 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులో పెడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది.
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకరి సినిమాలు ఒకరికి వెళ్లడం అనేది చాలా కామన్. అలానే `బింబిసార`ను సినిమాను ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు హీరోలు మిస్ చేసుకున్నారట. డైరెక్టర్ వశిష్ఠ్ తన డబ్యూ సినిమా కథతో యంగ్ హీరో నితిన్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలకువినిపించారట. అయితే ఈ నలుగురు హీరోలు `బింబిసార`ను వేరు వేరు కారణాల వల్ల రిజెక్ట్ చేశారట. దాంతో కళ్యాణ్ రామ్కు ఈ హిట్ మూవీ చేసే అవకాశం దక్కించని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే `బింబిసార`ను ఆ నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారా.. అన్నది వాళ్లకే తెలియాలి.