సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి పరిచయాలు అవసరం లేదు. `స్వయంవరం` వంటి హిట్ మూవీతో గ్రాండ్ గా సినీ కెరీర్ను ప్రారంభించిన వేణు.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దశాబ్దం పాటు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగిన ఈయన 2013లో విడుదలైన `రామాచారి` తర్వాత తెరపై కనిపించలేదు.
అయితే మళ్లీ ఇన్నేళ్లకు మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపుదిద్దుకున్న `రామారావు ఆన్ డ్యూటీ`తో వేణు రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వేణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఆ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలెన్నో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు జగపతిబాబును నమ్మి డబ్బును కూడా పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. వేణు మాట్లాడుతూ.. `జగపతిబాబు గారితో మంచి రిలేషన్ ఉండేది. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో కలిసి కొన్ని సినిమాలు చేశాను. అయితే మా ఇద్దరి మధ్య ఓ సంఘటన జరిగింది. దాని కారణంగా నేను ఆర్థికంగా నష్టపోయాను.
ఒక వ్యక్తికి నా చేత డబ్బిలిప్పించారు. నాది హామీ అని జగపతిబాబు గ్యారెంటీ ఇవ్వడంతోనే నేను డబ్బులిచ్చా. కానీ ఆ వ్యక్తి డబ్బు తిరిగివ్వలేదు. డబ్బు వెనక్కిచ్చారా లేదా..? అని జగపతిబాబు కూడా అడగలేదు. నాకు చాలా బాధ కలిగింది. మొత్తం రూ.14 లక్షలు. ఆరోజుల్లో అది నాకు చాలా పెద్ద అమౌంట్.`అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!