`లవ్ స్టోరీ`, `బంగార్రాజు ` వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అక్కినేని నాగచైతన్య నుండి వస్తోన్న చిత్రం `థ్యాంక్యూ`. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మ్యూజిక్ సెన్షేషన్ తమన్ స్వరాలు సమకూర్చారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మించిన ఈ చిత్రం.. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ, మేకర్స్ విడుదలను ఆలస్యం చేస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ జూలై 22న అట్టహాసంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
థ్యాంక్యూ టీజర్.. ఎన్నో వదులుకున్నా, ఇక నో కాంప్రమైజ్ అంటున్న చైతు!
ఇందులో భాగంగానే నిర్మాత దిల్ రాజు.. మూవీ టీమ్తో కలిసి మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. అలాగే `థ్యాంక్యూ`ను ఎందుకు చూడాలి..? అన్న ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న కారణంగా `ఆర్ ఆర్ ఆర్` సినిమాను చూశారు.
మాస్ యాక్షన్ విజువల్స్ కోసం `కేజీఎఫ్ 2`ను చూశారు. అలా `థ్యాంక్యూ` సినిమాను ఎందుకు చూడాలి? అంటే ఫీల్ కోసం చూడాలి. ఈ సినిమా చూసిన తరువాత ఆ ఫీల్ మీతో పాటు మీ ఇంటికి వస్తుంది. మీ ఎదుగుదలలో మీకు సహకరించినవారికి కాల్ చేసి మాట్లాడేలా చేస్తుంది.` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో వ్యాఖ్యాలు సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి.