శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి పరిచయాలు అవసరం లేదు. 2020లో ఈయన వైఘా రెడ్డి (తేజస్వి)ని రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్లోని ఫామ్ హౌస్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. 49 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించిన దిల్ రాజు.. ఇటీవలె మళ్లీ తండ్రి అయ్యాడు.
ఆయన భార్య తేజస్వి జూన్ 29న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారసుడు పుట్టడంతో.. తెలుగు చిత్రసీమకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే తాజాగా తనయుడికి దిల్ రాజు నాయకరణం చేశారు. ఇంతకీ ఆయన కుమారుడి పేరేంటో తెలుసా.. `అన్వయ్ రెడ్డి`.
మగబిడ్డకు జన్మనిచ్చిన దిల్రాజు సతీమణి తేజస్విని..!
అయితే ఈ పేరును పరిశీలించే క్రమంలో దిల్రాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అసలీ పేరు వెనక కథ ఏంటంటే.. దిల్ రాజు తన ఇద్దరు భార్యల పేర్లు కలిసేలా తనయుడికి పేరు పెట్టారట. ఆయన మొదటి భార్య పేరు అనిత. రెండో భార్య పేరు తేజస్వి కాగా.. పెళ్లికి ముందు వైఘా రెడ్డి అని మార్చారు.
ఈ క్రమంలోనే ఇద్దరు పేర్లలో అక్షరాలు కలిసి వచ్చేలా `అన్వయ్` గా కుమారుడికి నామకరణం చేసినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, త్వరలోనే కుమారుడి పేరును అఫీషియల్గా దిల్ రాజు అనౌన్స్ చేస్తారట. కాగా, దిల్ రాజు మొదట భార్య అనిత.. అనారోగ్యంతో 2017లో మరణించింది. వీరికి హన్షిత అనే కుమార్తె ఉంది. ఆమె ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తోంది.