సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం జరిగింది. కానీ అంతగా అభిమానులను ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే “గీతాగోవిందం”తో అద్దిరిపోయే విజయం సాధించి ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన పరుశురాం చిన్నపాటి సినిమాలు తీసే దర్శకుడిగా “సర్కారు వారి పాట”కు ముందుపేరు ఉంది. అయితే ఒక్కసారిగా పెద్ద స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయటంతో ఇప్పుడు.. తన తర్వాత సినిమాకి సంబంధించి పరుశురాం కన్ఫ్యూజన్ లో పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి “సర్కారు వారి పాట” తరువాత పరుశురాం అక్కినేని నాగచైతన్యతో సినిమా అని తెలిపారు. కానీ ఇప్పుడు నాగచైతన్య దర్శకుడు వెంకట ప్రభుతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమా కంప్లీట్ కావడానికి కనీసం ఏడు ఎనిమిది నెలలు టైం పడుతుంది. ఈ సినిమా తర్వాత “శ్యామ్ సింగ్ రాయ్” డైరెక్టర్ తో సినిమా చేయనున్నారు. సో ఈ రెండు సినిమాలు కంప్లీట్ కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ పరిణామంతో డైరెక్టర్ పరుశురాం మహేష్ బాబు వంటి పెద్ద హీరోతో తర్వాత చిన్న హీరోలతో చేయటానికి ముందుకు వెళ్లలేక మరో సినిమా ఎవరితో అనేది తేల్చుకోలేక మదన పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఇటువంటి పరిస్థితిలో పరుశురాం ఏ హీరోతో తర్వాత సినిమా చేస్తారో చూడాలి.