మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచంలోనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. అన్ని రంగాలలో గతంలో కాకుండా రకరకాల మార్పులు కొత్తగా రావడం జరిగాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా కొద్ది సమయంలోనే చాలా మార్పులు వచ్చాయి. ఓటిటి కి బాగా గిరాకీ పెరిగిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు కూడా సినిమా ధియేటర్ల కంటే ఎక్కువగా ఓటిటి లకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కారణంగా ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే థియేటర్ లో 50 రోజులు ఆడిన అనంతరం ఓటిటి లో దర్శనమిచ్చేస్తుంది.
అరచేతుల్లోకి ఎంటర్టైన్మెంట్ వచ్చేయడంతో ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఓటిటిలో రకరకాల కంటెంట్ లు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సైతం ఓటిటి లలో అనేక షోలలో పాల్గొంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓటిటి లపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి ఓటిటి అనేది పెద్ద బోధంగా మారిందని వ్యాఖ్యానించారు. ఓటిటి పోటీ పెరిగిన తరుణంలో ప్రేక్షకులను థియేటర్ కి రప్పించేలా ఉండే చక్కని స్టోరీలతో దర్శకులు సినిమాలు తీయాలని రాఘవేంద్రరావు సూచించారు.
ఇటీవల శ్రీధర్ సిపాన దర్శకత్వం వహించిన పండుగాడు టీజర్ విడుదల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు ఓటిటి పై తనదైన శైలిలో సీరియస్ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. మరోపక్క ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ ఇప్పటికే ఓటి రంగంలో దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో చిరంజీవి సైతం మంచి కంటెంట్ ఉంటే ఓటిటిలో తాను నటించడానికి సిద్ధమని ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారాయి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!