నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు.
అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు. `మెగా 154` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలోనూ శ్రుతి హాసన్ నే హీరోయిన్ కాగా.. మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే బాలయ్య `ఎన్బీకే 107` మరియు చిరంజీవి `మెగా 154` చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ పడనున్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
కానీ ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. దీంతో ఏదో ఒక చిత్రమే సంక్రాంతికి విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సంక్రాంతి పోరేమో గానీ ఈ దీపావళికి మాత్రం బాలయ్య చిరుల మధ్య వార్ ఖాయమని తెలుస్తోంది.
అదెలా అంటారా.. ఇటు బాలయ్య `ఎన్బీకే 107`, అటు చిరంజీవి `మెగా 154` చిత్రాల నుంచి దీపావళికి టీజర్లు రాబోతున్నాయట. అభిమానులకైతే ఎవరి హీరో టీజర్ వారికి నచ్చుతుంది. కానీ సగటు ప్రేక్షకుడికి ఏది నచ్చుతుందో అదే పోటీలో నెగ్గుతుంది. మరి ఈ దీపావళికి పేలే పటాస్ బాలయ్యదా..? లేక చిరంజీవిదా..? అన్నది చూడాల్సి ఉంది.
https://newsorbit.com/cinema/balayya-babu-gave-a-bumper-offer-to-puri-who-was-in-the-flops.html