`క్రాక్`తో చాలా కాలం తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కి.. `ఖిలాడి`తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన మాస్ మహారాజ్ రవితేజ.. ఇప్పుడు `రామారావు ఆన్ డ్యూటీ`తో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వాయిదా పడుతూ పడుతూ చివరాఖరకు జూలై 29న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. దీంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `రామారావు ఆన్ డ్యూటీ` కథ చెబుతానంటే ఓ హీరో వద్దు పొమ్మన్నాడట. ఇంతకీ ఆయనెవరో కాదు.. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి. చాలా కాలం నుండీ సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన `రామారావు ఆన్ డ్యూటీ`తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఆయన్ను ఈ సినిమాకు ఎలా ఒప్పించానో తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ శరత్ మండవ వివరించాడు. శరత్ మాట్లాడుతూ ..“వేణు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆయన బాగా సూట్ అవుతారని అనిపించింది.
కాకపోతే ఆయన సినిమాలు మానేసి చాలా కాలమైంది. అయినా సరే కథ చెప్పడానికి వెళ్లాను. `చేసే ఉద్దేశం లేనప్పుడు వినడం ఎందుకండీ .. వద్దండి` అని ఆయన అనేశారు. ఒకసారి కథ వినండి సార్ .. ఆ తరువాత మీ అభిప్రాయం చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేశాను.. అప్పుడు ఆయన కథ విన్నారు. కథ మొత్తం విన్న తరువాత చేస్తానని చెప్పారు. అలా మొత్తానికి ఆయనను ఒప్పించగలిగాను“ అని చెప్పుకొచ్చాడు. మరి రీఎంట్రీలో వేణు ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!