నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `బింబిసార`. వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు.
కళ్యాణ్ రామ్ కెరీర్లో తెరకెక్కుతున్న తొలి ఫాంటసీ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. అత్యంత భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వ్యాల్యూస్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. మేకర్స్ ప్రచార కార్యక్రమాలతో మరింత హైప్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. `బింబిసార` కథ మొదట కళ్యాణ్ రామ్ వద్దకు వెళ్లలేదు. డైరక్టర్ వశిష్ట ముందు బింబిసార కథ మాస్ మహరాజ్ రవితేజ దగ్గరకు తీసుకెళ్లాడట. రవితేజకి కథ బాగా నచ్చిందట.
కానీ, పలు కారణాల వల్ల ఆయన `బింబిసార`ను వదుకున్నారట. దాంతో డైరెక్టర్ వశిష్ట కళ్యాణ్ రామ్ను సంప్రదించగా.. ఆయనకు స్టోరీ నచ్చి వెంటనే సినిమా చేసేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. ఏదేమైనా కళ్యాణ్ రామ్ స్థానంలో రవితేజ చేసినా `బింబిసార` మీద ఇదే రేంజ్ అంచనాలు ఉండేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!