టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపుదిద్దుకున్న తాజా చిత్రమే `ది వారియర్`. తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి విలన్గా చేశాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే మాస్ మూవీ కావడం వల్ల.. టాక్ ఎలా ఉన్నా బీసీ సెంటర్స్ లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి రూ. 16.76 కోట్ల రేంజ్లో షేర్ను రాబట్టింది.
`ది వారియర్` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. వచ్చిందెంత? రావాల్సిందెంత?
బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఈ మూవీ రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. కానీ, అంత పెద్ద టార్గెట్ను రామ్ అందుకోవడం కష్టమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈమూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ మారింది.
అదేంటంటే.. ఈ సినిమా కథను లింగుసామి రామ్ కంటే ముందే టాలీవుడ్కి చెందిన ఇద్దరు స్టార్ హీరోలకు వినిపించాడట. ఈ హీరోలు మరెవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అట. అయితే ఈ హీరోలిద్దరూ పలు కారణాల వల్ల ది వారియర్ మూవీని రిజెక్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!