`ఇస్మార్ట్ శంకర్` వంటి హిట్ అనంతరం డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం `లైగర్`. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ఇందులో జంటగా నటించారు. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలి, గెటప్ శీను, మైక్ టైసన్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం.. నిన్న భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయళ మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, తొలి షో నుంచే ఈ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథాకథనాల్లో కొత్తదనం లేకపోవడం, పూరీ మార్క్ కనిపించకపోవడం, సాంగ్స్ను ఎక్కడ బడితే అక్కడ అతికించడం, సెకెండాఫ్ తేలిపోవడం సినిమాకు మైనస్లుగా మారాయి.
మరి ఈ టాక్తో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నదే ఆసక్తికరంగా మరింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. పూరి జగన్నాథ్ `లైగర్` కథను విజయ్ దేవరకొండ కంటే ముందే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోకు వినిపించాడట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఆయన ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా `లైగర్`ను మిస్ చేసుకున్నాడట. దాంతో పూరి మనసు విజయ్ దేవరకొండ వైపు మల్లిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ `లైగర్`ను వదులుకుని మంచి పని చేశాడంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.