టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్` నేడు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంట్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్ తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో `లైగర్` విఫలం అయింది. ఈ మూవీకి చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్, నటి అనసూయ ఓ ట్వీట్ చేసింది. `అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా ..ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది` అంటూ తన ట్వీట్లో ఆమె పేర్కొంది.అయితే అనసూయ ట్వీట్ `లైగర్` మరియు విజయ్ను ఉద్ధేశించే అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అందుకు కారణం లేకపోలేదు.. విజయ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తిండి పోయే `అర్జున్ రెడ్డి` చిత్రం మంచి విజయం సాధించినప్పటికీ.. విమర్శలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మని తిట్టినట్లుగా ఉండే ఒక బూతు డైలాగ్ పెద్ద కాంట్రవర్సీ అయింది. దీనిపై అనసూయ కూడా అప్పట్లో మండిపడింది. మీడియా డిబేట్స్ లో విజయ్ మరియు చిత్ర టీమ్పై విమర్శల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు అమ్మని ఉద్దేశించి విజయ్ చెడుగా అన్న డైలాగ్.. ఇప్పుడు కర్మ రూపంలో లైగర్ మూవీగా తిరిగి వచ్చింది అని అర్థం వచ్చేలా అనసూయ ట్వీట్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది.
అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022