మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల `సీతారామం` మూవీ తో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రేమ కావ్యమిది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేయగా.. అక్కడ సైతం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే దుల్కర్ తాజా చిత్రం `చుప్` విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్.బాల్కీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ కీలక పాత్రను పోషించాడు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్.. బాలీవుడ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ `ఈ బాయ్ కాట్ కల్చర్ సోషల్ మీడియా ద్వారా మొదలైంది. ప్రజలు సోషల్ మీడియాలో ఏదైనా రాయగలరు.
అందుకే ప్రజలు బాధ్యతా రహితంగా సినిమాను బహిష్కరించే అజెండాను ప్రారంభించారు. ఈ దారుణమైన బాయ్ కాట్ కల్చర్ బాలీవుడ్ లోనే ఉంది. సౌత్ లో ఇలాంటి పరిస్థితి ఏమీ లేకపోవడం అదృష్టం.` అంటూ దుల్కర్ అభిప్రాయపడ్డారు. కాగా, గత కొద్దిరోజుల నుంచి బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ను కుదిపేస్తోంది. దీనివల్ల బాలీవుడ్ సినిమాల ఫలితాలు తారుమారు అవుతున్నాయి. కొన్ని చిత్రాలైతే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై స్టార్స్ సైతం మాట్లాడ్డానికి జంకుతున్నారు. ఇలాంటి తరుణంలో దుల్కర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
https://www.instagram.com/tv/CiHPNYPJtC5/?utm_source=ig_web_copy_link