Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. `తలైవా 169` అనే వర్కింగ్ టైటిల్తో ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు `జైలర్` టైటిల్ ను ఖరారు చేస్తూ ఇటీవలె అధికారిక పోస్టర్ ను బయటకు వదిలారు. ఇందులో రజనీకాంత్ కు జోడీగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ నటించబోతోంది.
అలాగే రమ్యకృష్ణ, శివరాజ్కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడెక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. ఈ మూవీలో రజనీ `జైలర్` గా కనిపిస్తాడట. కథ అంతా కూడా జైల్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ప్రత్యేకంగా వేసిన జైల్ సెట్ లోనే ఎక్కువ శాతం షూటింగ్ ను జరపనున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ విషయంపైనే రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎందుకంటే, నెల్సన్ దిలీప్ కుమార్ గత చిత్రం `బీస్ట్` కూడా ఇదే తరహాలో ఉంటుంది. ఈ మూవీ కథ అంతా కూడా ఒక షాపింగ్ మాల్ చుట్టూనే తిరుగుతుంది. కట్ చేస్తే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మరి ఈ విషయం తెలిసి కూడా రజనీకాంత్ ఎందుకంత రిస్క్ చేస్తున్నారు, అసలు బీస్ట్ తరహా కథనే ఎందుకు ఎంచుకున్నారు అంటూ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!