Puri Jagannadh: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. మధ్యలో వరుస ఫ్లాపులు పడినా `ఇస్మార్ట్ శంకర్`తో మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఈయన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో రెండు చిత్రాలు చేస్తున్నారు.
అందులో ఒకటైన `లైగర్` ఇప్పటికే షూటింగ్ను కంప్లీట్ చేసుకోగా.. మరొకటి అయిన `జనగణమన` ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ఇకపోతే పూరీ ఓవైపు దర్శకుడిగా, మరోవైపు పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా సత్తా చాటుతున్నారు. ఈ బ్యానర్ నిర్మాణ బాధ్యతలని ప్రముఖ హీరోయిన్ ఛార్మి చూసుకుంటూ వస్తోంది. పూరీ తెరకెక్కిస్తున్న ప్రతి సినిమాకి ఛార్మినే ప్రొడక్షన్ వర్క్ ను చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూరీ ఎక్కడ ఉంటే అక్కడ ఛార్మి కనిపిస్తోంది. బయట పార్టీల్లో సైతం వీరిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. దాంతో వీళ్ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. అంతేకాదు, పూరీ జగన్నాథ్ తన భార్య లావణ్యకు విడాకులు ఇచ్చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంలో పూరీ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరీ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. `చోర్ బజార్` సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న ఆకాశ్.. తల్లిదండ్రుల విడాకుల వార్తలపై స్పందించారు.
`అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్ మమ్మీనే. వాళ్లది లవ్ మ్యారేజ్. మా పేరెంట్స్ లవ్లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే.. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు ఎలా విడిపోతారు. కొందరు టైంపాస్ కోసమే తప్పుడు వార్తలు రాస్తున్నారు. వాటిలో ఎటువంటి నిజం లేదు.` అంటూ ఆకాశ్ చెప్పుకొచ్చాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!