`ఏంటీ.. నటసింహం నందమూరి బాలకృష్ణ.. కమెడియన్ సప్తగిరి కాళ్ళకు దణ్ణం పెడతానని అన్నారా..?` అన్న సందేహం పైన టైటిల్ చూడగానే రాక మానదు. అయితే మీ సందేహం నిజమే. బాలయ్యనే ఆ మాటలు అన్నారు. అసలేమైందంటే.. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
`ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సప్తగిరి కూడా ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతోంది.
అయితే షూటింగ్ మధ్య చిన్న బ్రేక్ దొరకడంతో బాలకృష్ణ.. కమెడియన్ సప్తగిరిని డైలాగ్ వార్ కి ఆహ్వానించారు. ఇక బాలయ్య పౌరాణిక చిత్రంలోని ఒక భారీ డైలాగ్ ని చెబుతూ ఆగిపోగా.. సప్తగిరి మాత్రం ఆ డైలాగుని తడబడకుండా చెప్పి ఆశ్చర్యపరిచాడు.
సప్తగిరి డైలాగులు చెప్పిన తీరుకు బాలకృష్ణ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే `ఒకసారి నీ కాళ్ళు పైకి ఎత్తరా. దణ్ణం పెడతా` అని అనడతో.. ఒక్కసారిగా సప్తగిరి షాక్ అయ్యాడు. వెంటనే బాలకృష్ణ కాళ్ళకే సప్తగిరి నమస్కరించి కిందనే కూర్చున్నాడు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
Balayya babu and Saptagiri funny conversation #NandamuriBalakrishna#Balakrishna #Saptagiri #NBK107 pic.twitter.com/iD6yDwo0zm
— Balayya Yuvasena (@BalayyaUvasena) September 9, 2022
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!