మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `గాడ్ ఫాదర్` ఒకటి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ డ్రామా ఇది. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్టైన `లూసిఫర్` సినిమాను రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలో విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ వచ్చే నెల నుంచి ప్రచార కార్యక్రమాలను కూడా షురూ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. `గాడ్ ఫాదర్` ఓటీటీ రైట్స్ ను మేకర్స్ విక్రయించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట.
`గాడ్ ఫాదర్` ఓటీటీ రైట్స్ భారీ ధర పలికియాని.. రూ. 50 కోట్లు అమెజాన్ ప్రైమ్ వారు చల్లించారని అంటున్నారు. అయితే ఈ సినిమా తెలుగు ఓటీటీ హక్కుల్ని మాత్రమే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందా లేక హిందీ హక్కుల్ని కూడా తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఓటీటీ హక్కులే రూ. 50 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలోనే చిరునా మజాకా అంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.