Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో అభిమానులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు ప్రకటిస్తున్నా గాని… రిలీజ్ విషయంలో ఆలస్యం చేస్తూ ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. “బాహుబలి” వంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ప్రభాస్ సరైన హిట్టు కొట్టలేకపోయాడు. సాహో, రాదేశ్యామ్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయపాలయ్యాయి. పైగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు.. సమయం కూడా దాదాపు మూడు సంవత్సరాలకు పైగా కేటాయించటం జరిగింది. దీంతో అభిమానులు ప్రభాస్ కెరియర్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సినిమా కోసం ఏడాదిన్నరకు పైగా టైం కేటాయించడం… తీరా ఫలితాలు చూసేసరికి అట్టర్ ప్లాప్ లు కావటం ఇందుకు కారణం.
ఇటువంటి తరుణంలో ప్రభాస్ ఇప్పుడు అభిమానుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారట. విషయంలోకి వెళ్తే ఇక ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగా ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ రిలీజ్ ప్లాన్ చేయగా వచ్చే ఏడాది మారుతి సినిమాతో పాటు… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విడుదల చేయనున్నారట. ఇక 2024 ప్రారంభంలో “అర్జున్ రెడ్డి” దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమా ఆ తర్వాత సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారట. సందీప్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే “స్పిరిట్” లో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఈ రీతిగా ఈ ఏడాది నుండి ప్రతి ఏటా రెండు సినిమాలు విడుదల అయ్యేలా అభిమానులను అలరించేలా ప్రభాస్ ప్లానింగ్ చేసినట్లు సమాచారం. వాస్తవానికి “ఆదిపురుష్” ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ సరిగ్గా లేకపోవడంతో పాటు ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ రావడంతో …మళ్ళి ఇప్పుడు మార్పులు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో జూన్ 16వ తారీకు “ఆది పురుష్” రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక యధావిధిగా సెప్టెంబర్ లో “సలార్” రిలీజ్ కానుంది.