Gopichand: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ తొట్టెంపూడి అంటే తెలియని వారుండరు. రష్యాలో ఇంజనీరింగ్ ను కంప్లీట్ చేసిన ఈయన.. ప్రముఖ దర్శకనటుడు టి. కృష్ణ మరణాంతరం ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ `తొలి వలపు` మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. హీరోగా తొలి సినిమా చేశాక గోపీచంద్కు విలన్ అవకాశాలు వచ్చాయి.
అయినప్పటికీ నిరాశ చెందకుండా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ మంచి నటుడిగా మార్కులు వేయించుకున్నాడు. యజ్ఞం, ఆంధ్రుడు, రణం వంటి చిత్రాలతో హీరోగా నిలదొక్కుకుని.. కెరీర్ పరంగా మంచి జోరు చూపించాడు. అయితే 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ `లౌక్యం` తర్వాత వరుస ఫ్లాపులు పడటంతో ఈయన గ్రాఫ్ డౌన్ అయిపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక గత ఎనిమిదేళ్ల నుంచీ సక్సెస్ లేక సతమతం అవుతున్న గోపీచంద్.. ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా గోపీచంద్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో ఆయన తన ఫెయిల్సర్ లవ్ స్టోరీని అందరితోనూ పంచుకున్నారు. “బీటెక్ చదివే టైమ్ లో ఒక రష్యన్ అమ్మాయి ప్రేమలో పడ్డాను. ఇద్దరూ ఒకే బస్సులో కలేజ్ కి వెళ్లేవాళ్లం. పెళ్లి చేసుకుందాం అని అడిగేయాలని అనిపించడంతో ఓ మంచి రోజు చూసుకుని ఆ అమ్మాయిని అడిగేశాను. కానీ, ఆ అమ్మాయి `నా దేశం వేరు నీ దేశం వేరు, మా ఫ్యామిలీ మన పెళ్లికి అంగీకరించరు` అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసింది. నేను ఆమె చెప్పిన మాటలకు సరే అని అన్నాను“ అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చారు. కాగా, గోపీచంద్ సీనియర్ హీరో శ్రీకాంత్ సోదరి కుమార్తె అయిన రేష్మా ను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి విరాట్ కృష్ణ, వియాన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు.