Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో.. కుటుంబ సభ్యులు ఇంకా ఇండస్ట్రీ అభిమానులు ఎంతగానో శోకసంద్రంలోకి వెళ్లిపోయారు. ఒకే ఏడాదిలో ముగ్గురు మరణించడంతో మహేష్ ఫ్యామిలీ కృంగిపోయింది. జనవరిలో రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో ఇందిరాదేవి ఇప్పుడు కృష్ణ మరణంతో.. ఘట్టమనేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించడం జరిగింది. మరి కాసేపటిలో మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
కడసారి తాత భౌతిక కాయని చూడటానికి మహేష్ కొడుకు గౌతం లండన్ నుంచి ఈరోజు ఉదయం వచ్చి.. కృష్ణకి నివాళులు అర్పించడం జరిగింది. ఇదే సమయంలో సితార కూడా నివాళులు అర్పించింది. ఈ క్రమంలో సితార సోషల్ మీడియాలో తాత మరణ వార్త పై ఎమోషనల్ పోస్టు పెట్టింది. “ఇకపై మీరు లేకుండా భోజనం చేయాలి. మీరు నాకు చాలా విలువైన విషయాలు నేర్పారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నారు. ఇప్పుడు నాకు మిగిలింది మీ జ్ఞాపకాలు మాత్రమే. మీరే నా హీరో తాత. ఏదో ఒక రోజు మీరు గర్వపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తాతగారు అంటూ బ్రోకెన్ హార్ట్ సింబల్ తో ఇన్ స్టాలో సితార పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే కడసారి తమ అభిమాన నటుడిని చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు తమిళనాడు ఇంకా కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా వస్తూ ఉన్నారు. అన్న రమేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇప్పుడు తండ్రి కృష్ణ మరణించడంతో… మహేష్ చాలా కృంగిపోయారు. దీంతో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో… సానుభూతి #Staystrong mahesh అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!