Guppedantha Manasu November 11Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 11వ తేదీ Guppedantha Manasu సీరియల్ 605 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం. వసు యూనివర్సిటీ టాపర్ కావడంతో అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.దేవయాని మాత్రం లోలోపల రగిలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి. మరి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.వసు సాధించిన విజయం చూసి జగతి చాలా ఆనందపడుతుంది.మహేంద్ర దగ్గరకు వచ్చి వసుకి మన తరపున ఏదో ఒక అభినందనలు పంపించు అంటుంది.. కనీసం ఒక కేక్, బొకే ఇలా ఏదైనా చెయ్ మహేంద్రా’ అంటుంది. అంతకంటే అదిరిపోయేది గిఫ్ట్ పంపిస్తా అని నాకో ఐడియా వచ్చింది ఏం చేస్తానో చూడు’ అంటూ పరుగుతీస్తాడు
వసు విజయాన్ని తట్టుకోలేని దేవయాని :
సీన్ కట్ చేస్తే వసు విజయాన్ని తలుచుకుని దేవయాని రగిలిపోతూ ఉంటే గౌతమ్ వచ్చి ‘పెద్దమ్మా.. వసుధార చాలా గ్రేట్ అంటూ పొగిడేస్తుంటాడు. ఇంకా మనసులో కుళ్లుకుంటుంది దేవయాని. ఇంతలో ధరణీ వచ్చి అత్తయ్యగారు స్వీట్స్ రెడీ అంటుంది.‘స్వీట్ మాత్రమేనా? హారతి ఇస్తావా?’ అంటుంది దేవయాని. ‘మీ అనుమతి లేకుండా నేను ఏ రోజైనా ఏదైనా చేశానా అత్తయ్యగారు’ అంటుంది ధరణీ అమయాకంగా అప్పుడే గౌతమ్ మనసులో వసుధార అంటే పెద్దమ్మకు అస్సలు ఇష్టం ఉండదని అర్ధం చేసుకుంటాడు. పెద్దమ్మా మీరు గ్రేట్.. వసుధార కోసం స్వీట్స్ కూడా చేయించారు మీరు అంటాడు. ‘నేను ఎక్కడ చేయించాను.. రిషికి భయపడి చేయించాల్సి వచ్చింది’ అని మనసులో అనుకుంటుంది దేవయాని.
ఒకరికొరు స్వీట్స్ తినిపించుకున్న వసు, రిషి:
ఇక అప్పుడే రిషి, వసులు ఇంటికి వస్తారు. వసు నీట్లో పడిపోవడంతో రిషి కోట్నే కప్పుకుని ఇంటికి వస్తుంది. ‘ఏంటి ఈ అవతారం వసుధారా’ అని అడుగుతుంది దేవయాని. ‘తర్వాత చెబుతాను పెద్దమ్మా అంటాడు రిషి. సరే నువ్వు వెళ్లి రెడీ అయ్యి రా అంటూ వసుని పంపిస్తాడు రిషి. రిషి కూడా వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాడు. రాగానే అందరు ఆనందంగా ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటారు.
మహేంద్ర ఇచ్చిన షాక్ నుంచి తెరుకోలేని దేవయాని :
దేవయాని అయిష్టంగానే వసుకి స్వీట్ పెట్టి ఇప్పుడైనా ‘కనీసం ఆ జగతీ మహేంద్రలుఓ ఫోన్ చేసి మీ ఇద్దరినీ అభినందించి ఉండొచ్చుగా’ అంటూ రిషిని రెచ్చగొడుతుంది.అప్పుడే గౌతమ్.. ఓ పేపర్ చూపిస్తూ ఆంటీ, అంకుల్ అంతకంటే గొప్ప అభినందనలే తెలిపారు పెద్దమ్మా అంటూ పేపర్ లో వసు, రిషిల ఫోటో చూపిస్తాడు.పేపర్లో ‘అందరి అంచనాలు నిలబెడుతూ యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన వసుధారకు అభినందనలు..అలాగే ఆ దిశగా కృష్టి చేసిన రిషీంద్ర భూషణ్కి అభినందనలు.. ఇట్లు జగతీ, మహేంద్ర అంటూ వసు ఫొటో, రిషి ఫొటో వేసి కింద మహేంద్ర, జగతీ ఫొటోలతో ప్రకటన వేయిస్తాడు మహేంద్ర. అది చూసి అంతా మురిసిపోతుంటే దేవయాని మాత్రం రగిలిపోతుంది.
మేడపై ఒంటరిగా ప్రేమ పక్షులు :
ఇక రిషి మాత్రం డాడ్ మీరు నన్ను మర్చిపోలేదు అని తండ్రిని తలుచుకుని బాధపడతాడు.ఇక రాత్రి అవ్వడంతో వసు మేడ మీద దీపలు పెడుతూ ఉంటుంది. రిషి తన దగ్గరే ఉన్న విఆర్ అని ఉన్న ఉంగరంను తీసుకుని వసు దగ్గరకు వెళ్తాడు. దీపాలు వెలిగించే సమయంలో వసుకు సాయం చేసి దేవుడికి మొక్కుతారు ఇద్దరూ. జగతీ రావాలని వసు.. మహేంద్ర రావాలని రిషి కోరుకుంటారు. ఆ తర్వాత ఆ ఉంగరం వసు చేతికి అందిస్తూ.. తన ప్రేమని తెలియచేస్తాడు రిషి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!