Guppedantha manasu today episode, October 29: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు అక్టోబర్ 29 వ తేదీ Guppedantha Manasu సీరియల్ 594 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో దేవయాని వసు మీద కోపంతో అరుస్తూ ఉండగా రిషి బయటకు వచ్చి ఏమైంది పెద్దమ్మ వసుధారను ఏమి అడుగుతున్నారు అని అంటాడు.. ఇక వసు నేను చెబుతాను సార్ అంటూ మీ పెద్దమ్మ గారు నన్ను మెచ్చుకుంటుంటున్నారు సార్ అంటూ చెబుతుంది. అదే సీన్ ఈరోజు ఎపిసోడ్ లో కంటిన్యూ అవుతుంది.
వసుకు థాంక్స్ ఎందుకు పెద్దమ్మ అన్న రిషి:
మేడం నన్ను బాగా మెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాను అట ఇకపై కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు థాంక్స్ చెబుతున్నారు అని వెటకారంగా అంటుంది వసుధార. ఇక రిషి ఎప్పటిలాగానే పెద్దమ్మ మాయలో పడి మీ అభిమానం నాకు తెలుసు పెద్దమ్మ అని అంటాడు.అయినా వసు కి మీరు ఎందుకు థాంక్స్ చెబుతున్నారు..తను ఎప్పుడో మన ఇంట్లో మెంబర్ అయిపోయింది కదా అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక వసు మాత్రం దేవయాని వంక చూస్తూ చూశారా మేడం సార్ ఏమి అన్నారో. మీరు ఏమి మహేంద్ర సార్,జగతి మేడం ఇంట్లో లేరని బాధపడకండి అని దేవాయనికి వెటకారంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
Guppedantha manasu today episode: జగతిని తప్పుపట్టిన రిషి :
ఇక బయట రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.రిషి సార్ ను గమనించిన వసుమిమ్మల్ని, మేడంతో కలపాలని నేను చాలా పట్టుదలగా ఉన్నాను కానీ ఇప్పుడు రిషిసార్, మహేంద్ర సార్ కి కూడా దూరమయ్యేలాగా ఉన్నారు.. ఒకవేళ నా పట్టుదల ఈ కుటుంబాన్ని మళ్ళీ వేరు చేస్తుందా అని వసు తనలో తానే బాధపడుతుంది.ఏదో ఆలోచిస్తున్నా రిషిని వెళ్దామా సార్ అని అడుగుతుంది.. మళ్ళీ రిషి బాధగా అసలు డాడ్ నన్ను వదిలి వెళ్లిపోవడం ఏమిటి వసుధార అని అంటాడు. నేను బాధపడతానని డాడ్ కి తెలుసు కదా..నేను ఆయనకు గుర్తు రావటం లేదా? అయినా మీ మేడం అయినా చెప్పాలి కదా డాడ్ కి నువ్వు వెళ్ళిపోతే రిషి బాధపడతాడు.. మనం రిషి దగ్గరికి వెళ్లి పోదామని డాడ్ కి ఒక్క మాట అయినా చెప్పాలి కదా అని అంటాడు. రిషి మాటలకు వసు స్పందిస్తూ… మేడం చెప్పకుండా ఎలా ఉంటారు సార్? మేడం తప్పకుండా చెప్పే ఉంటారు.. అయినా మీ అందరి దగ్గర ఉన్న కామన్ గుణం ఏంటంటే మంచితనం… దానితో పాటు కొంచెం మొండితనం అని నాలుగు ఓదార్పు మాటలు చెప్పి సరే పదండి సార్ వెళ్దాం అని అంటుంది వసు.
కొడుకు కోసం తల్లి ఆవేదన :
సీన్ కట్ చేస్తే వసు సారీ అని మెసేజ్ పెట్టింది మహేంద్ర అని అంటుంది. మనం ఇల్లు వదిలి వచ్చేసినందుకు సారీ చెప్పి ఉంటుంది అంతేకానీ తన పట్టుదల విషయంలో ఏమాత్రం తగ్గదు అని అంటాడు మహేంద్ర. అది కాదు మహేంద్ర మనం ఇల్లు వదిలి వచ్చి తప్పు చేస్తున్నామేమో.. ఇంత పట్టుదల పనికిరాదు. రిషి ఎంత బాధ పడుతున్నాడో ఒక్కసారి ఆలోచించు అని అంటుంది జగతి.చూడు జగతి మనం ఇంట్లో నుంచి ఒక్క సారీ కోసం బయటకు రాలేదు. రిషి, వసూలు కలవాలి. వాళ్ళ ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ రావాలి. ఇప్పుడిప్పుడే రిషిలో మార్పు మొదలైంది అది పూర్తయ్యాక మనం వెళ్దాం అని అంటాడు మహేంద్ర. రిషి బాధపడుతున్నాడు అని ఇప్పుడు మనం వెళ్తే మొదలుపెట్టిన పని పూర్తికాకుండానే మధ్యలోనే అయిపోతుంది. అయినా రిషి కన్నా వెయ్యి రెట్లు బాధ ఎక్కువగా నాకు ఉంది అని మహేంద్ర కొడుకుని తలుచుకుని ఎమోషనల్ అవుతాడు
Guppedantha manasu today episode: ధరణిణి అనుమానించిన దేవయాని :
మళ్ళీ సీన్ దేవయాని దగ్గర ఓపెన్ అవుతుంది..ఇల్లు క్లీనింగ్ చేస్తున్న ధరణిని పిలిచి కబుర్లు చెప్పుకుందాం రా అని అంటుంది. ధరణి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండగా ఒకసారి నీ ఫోన్ తీసుకురా ధరణి అని అంటుంది దేవయాని.సరే అత్తయ్యగారు అని ధరణి ఫోన్ ఇస్తుంది. దేవయాని ఫోన్ తీసుకొని చెక్ చేస్తూ ఉండగా ఏంటి అత్తయ్య, చిన్నత్తయ్య వాళ్ళు నాకు ఫోన్ చేశారు అని అనుకుంటున్నారా అని అంటుంది. ఏమో ఎవరికి తెలుసు… అయినా ఈమధ్య నీకు బాగా పొగరు పెరిగింది అని అంటుంది దేవయాని. సరే నాకు వంటింట్లో పని ఉంది ఏమైనా ఫోన్ వస్తే నాకు ఇవ్వండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి.
కొడుకు కోసం తండ్రి పడే ఆవేదన :
ఇక మహేంద్ర రిషి ఫోటో చూసుకుంటూ టిఫిన్ చేయటం మానేస్తాడు.వీడి ఫోటో ఒకటి చూస్తే చాలు కడుపు నిండిపోతుంది ఇంకేం తినాలని లేదు అని అంటాడు మహేంద్ర. రిషి మీద ఎంత ఇష్టం ఉన్నా రిషి తినకపోతే నువ్వు ఉండగలవా? అలాగే నువ్వు తింటే రిషి తిన్నట్టు భావించు అని అతని చేత బలవంతంగా తినిపిస్తున్న జగతిలో మహేంద్ర కి రిషి కనిపిస్తాడు.అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!