Harish Shankar-Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో త్వరలోనే `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్తో ఈ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది.
అలాగే రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నాడు. పవన్, హరీష్ల కాంబోలో ఇంతకు ముందు వచ్చిన `గబ్బర్ సింగ్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరి తాజా ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను ప్రకటించి చాలా కాలం అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. పవన్ పొలిటికల్ అజెండాల కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. పైగా అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీంతో 2024 తర్వాతే భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కనుందని, ప్రస్తుతం హరీష్ మరో హీరోను వెతుక్కునే పనిలో ఉన్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి.
అయితే కథనాలకు హరీష్ పరోక్షంగా స్పందిస్తూ షాకింగ్ ట్వీట్ పెట్టాడు. సీఎం కేసీఆర్ `వెధవలు, పనికిమాలినోళ్లు ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు` అంటూ తిట్టిన వీడియో ఆయన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉంది సీఎం కేసీఆర్ అయినప్పటికీ ఫీలింగ్ మాత్రం హరీష్ శంకర్ దే. భవదీయుడు భగత్ సింగ్ పై వస్తున్న పుకార్తలకు ఆయన అలా తన ఫీలింగ్స్ను బయట పెట్టారని అంటున్నారు.