టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. `ఇస్మార్ట్ శంకర్`తో మంచి కంబ్యాక్ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత `రెడ్`తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్గా `ది వారియర్`తో వచ్చాడు. తమిళ దర్శకుడు ఎన్. లింగుసామి రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ ఇది.
ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్గా చేశాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. కానీ, అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. మిశ్రమ స్పందన రావడంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ ఓ మోస్తరు కలెక్షన్స్ను వసూల్ చేస్తోంది.
ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 17.99 కోట్ల షేర్ ని అందుకోవాలైన అవసరం ఎంతైనా ఉంది. కానీ, అంత మొత్తంలో వసూల్ చేయడం కష్టమే. దీంతో ది వారియర్ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. అయితే వరుస ఫ్లాపుల్లోనూ రామ్ రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నాడట.
ఒక్కో సినిమాకు ఈయన రూ. 20 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ను డిమాండ్ చేస్తున్నాడట. రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నాడు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరినే ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు రామ్ రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!