Nayanathara: హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగులో దాదాపు చాలామంది టాప్ హీరోలతో నటించింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ.. ఇంకా మరి కొంతమంది హీరోలతో నటించడం జరిగింది. ఇటీవల చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలో కీలకపాత్ర పోషించింది. అనంతరం డైరెక్టర్ విగ్నేష్ నీ పెళ్లాడి.. సరగోసీ విధానం ద్వారా పిల్లలను కంటూ ఉంది. వెళ్లేలా కానీ సినిమాలు చేస్తున్న నయనతార రీసెంట్ గా బాహుబలి లో కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్ పై ఎమోషనల్ కామెంట్ చేసింది.
ఆయనను చూస్తే తనకు తండ్రి ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ కలిసి రాజారాణి సినిమాలో తండ్రీకూతురుగా నటించారు. ఇప్పుడు మళ్లీ కనెక్ట్ సినిమాలో అదే రీతిలో తండ్రి కూతుర్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తారీకు విడుదల కానుంది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి థియేటర్ యజమానించి కొద్దిగా వ్యతిరేకత ఏర్పడింది. ఏటువంటి విరామం లేకుండా 99 నిమిషాలు కలిగిన సినిమా ప్రదర్శించాలని అనుకున్నారు. దీంతో థియేటర్ యాజమాన్యాల నుండి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు 59 నిమిషాలకు విరామం ఎవరిని ఉన్నట్లు చిత్ర బృందం తెలియజేయడంతో రూట్ క్లియర్ అయింది. విరామం లేకుండా సినిమా ప్రదర్శించడం వల్ల థియేటర్ వద్ద చిరుతల వ్యాపారం పడిపోవడంతో పాటు తమ ఆదాయానికి గండిపడుతుందని థియేటర్ యజమానులు… ప్రారంభంలో ఈ సినిమా ప్రదర్శించడం పట్ల ముందుకు రాలేదు.
అయితే మధ్యలో 59 నిమిషాల తర్వాత.. ఇంటర్వెల్ ఉందని తెలియజేయడంతో… సినిమా ఈనెల 22వ తారీకు అనగా రేపు థియేటర్లలో రానుంది. అశ్విన్ శర్వావణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆత్మలను పిలిచి మాట్లాడటం అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందింది. ఈ క్రమంలో హీరోయిన్ ఒక ఆత్మను పిలిస్తే మరో ఆత్మరావడంతో సినిమాలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటివి అనే స్టోరీ తో… తెరకెక్కించినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది. నయనతార సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమానీ తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!