Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నోవాటేల్ హోటల్ లో ఏపీ పోలీసులు నిర్బంధించటం తెలిసిందే. శనివారం “విశాఖ గర్జన” కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేయడంతో.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో ఏపీ పోలీసులు దాడి చేసిన జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా విశాఖలో పరిస్థితులు మొత్తం మారాయి. విశాఖపట్నంకి “జనవాణి” కార్యక్రమం నిర్వహించడానికి.. వచ్చిన పవన్ కళ్యాణ్ నీ .. వెంటనే విశాఖ విడిచి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
తమ నాయకులను కార్యకర్తలను జైలు నుండి విడిపించాలని.. లేదంటే విశాఖ విడిచి వెళ్లే ప్రసక్తి లేదని పవన్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం విశాఖలో అడుగుపెట్టిన పవన్ ఇంకా నోవాటెల్ హోటల్ లోనే ఉన్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పెడుతున్న పోస్టులు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. హోటల్ నుండి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధిస్తూ ఉండటంతో… సరదాగా సాయంత్రం ఆర్కే బీచ్ లో ఈవినింగ్ వక్ కి వెళ్లాలని ఉంది పోలీసులు అనుమతిస్తారా అని సేటైరికల్ పోస్ట్ పెట్టారు. దీంతో ఏపీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ పెట్టిన ట్విట్ కి “కొమరం పులి” హీరోయిన్ నికిషా పటేల్ స్పందించింది. “నేను నీ వెంట నడుస్తా” అంటూ ట్వీట్ చేయడం జరిగింది.
ఈ రీతిగా నికిషా పటేల్ స్పందించడంతో జనసైనికులు సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కి సపోర్ట్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2010వ సంవత్సరంలో “కొమరం పులి” సినిమా రావడం జరిగింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో నికిషా పటేల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గాని సినిమా పరాజయంతో పెద్దగా అవకాశాలు రాలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం నికిషా పటేల్ చాలా యాక్టివ్ గా ఉంటూ సరికొత్త ఫోటోలతో తన ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటది. ఈ క్రమంలో పవన్ పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇవ్వటంతో పవన్ అభిమానులు నిఖీషా పటేల్ కి థాంక్స్ చెబుతున్నారు.