Poonam Kaur: తెలుగు నటి పూనమ్ కౌర్ అందరికీ సుపరిచితురాలే. 2010 ఆ టైంలో పలు సినిమాలు చేసి ఎంత పాపులారిటీ సంపాదించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగుదేశం పార్టీ హయాంలో… చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా రాణించింది. అనంతరం 2019 ఎన్నికల సమయంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆ తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల వరదైన వ్యాధికి గురికావడం జరిగింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. విషయంలోకి వెళ్తే తనకు ఫైబ్రోమయాల్జియా వ్యాధి నిర్ధారణ అయినట్టు ప్రకటించింది. ఈ వ్యాధి కారణంగా శరీరమంతటా తీవ్రమైన నొప్పి, అలసట, డిప్రెషన్ ఫైబ్రోమయాల్జియా లక్షణాలతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం నాతిచరామి అనే సినిమాలో నటించడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కావలసి ఉంది. ఈ క్రమంలో పూనం కౌర్ ఈ అరుదైన వ్యాధికి గురికావడంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
ఈ సందర్భంగా ‘‘ఎన్నో ప్రణాళికలతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తిని ఫైబ్రోమయాల్జియా, నిదానించి విశ్రాంతి తీసుకునేలా చేసింది’’ అంటూ పూనమ్ కౌర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇటీవలే అక్టోబర్ నెలలో సమంత మయోసిటీస్ అని అరుదైన వ్యాధికి గురైనట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. మూడో దశలో ఈ వ్యాధి ఉన్నట్లు చికిత్స చేయించుకున్నట్లు పేర్కొంది. అయితే ఇంతలోనే పూనం కౌర్ కూడా వ్యాధి బారిన పడినట్లు తెలపటం సంచలనం రేపింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. మరోపక్క ఈ వ్యాధికి చికిత్స కోసం పూనం కేరళ వెళ్లడం జరిగింది.