టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అదే `లైగర్`. ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. మ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు.బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఆగస్టు 25న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సౌత్తో పాటు నార్త్లోనూ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. లైగర్ కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన కన్నా మరో వ్యక్తిని ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇంతకీ ఆ వ్యక్తి మరెవరో కాదు.. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. విజయ్ దేవరకొండ దాదాపుగా రూ. 35కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటుంటే, మైక్ టైసన్కు రూ. 40 కోట్లు ముట్టచెప్పారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. నెట్టింట మాత్రం ఈ న్యూస్ వైరల్గా మారింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!