Allu Arjun: `పుష్ప ది రైస్`తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` పై దృష్టి సారించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్గా అలరించబోతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై హై బడ్జెట్తో నిర్మితం కానున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం వచ్చే నెల నుంచీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే టాలీవుడ్లో స్టార్ హీరోలే కాదు టైర్ 2 హీరోలు కూడా రెండు, మూడు ప్రాజెక్ట్లను లైన్లో పెట్టుకున్నారు. కానీ, బన్నీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. `పుష్ప` తర్వాత ఏ డైరెక్టర్తో సినిమా చేయనున్నాడు అన్నది ఇప్పటికే వరకు ప్రకటించలేదు.
దాంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విషయంపై విజయ దశమి సందర్భంగా క్లారిటీ రానుందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది విజయ దశమి సందర్భంగా ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఆ ప్రాజెక్ట్ ఎవరితోనూ ఆ రోజే స్పష్టత రానుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!