మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన `వేదాళం`కు అఫీషియల్ రీమేక్ ఇది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.
ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. అలాగే చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా అలరించబోతోందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. చిరుతో తమన్నా చేస్తున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ `సైరా`లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అయితే భోళా శంకర్లో తమన్నా ఉన్నా లేనట్టే అట. ఆమె పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత ఉండదట. చిరంజీవి, ఆయన చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేశ్ మధ్యే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయట. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి.. అలా ఉండేలా డైరెక్టర్ చూసుకుంటున్నాడట.
అందుకారణంగానే తమన్నా పాత్రకు పెద్దగా ఇంప్యాక్ట్ ఉండదని, అసలు ఆమెపై ముందు రాసుకున్న సన్నివేశాలను సైతం తాజాగా కట్ చేసేశారని ఓ టాక్ ఇప్పుడు బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, తమన్నా ఇటీవలె `ఎఫ్ 3`తో ప్రేక్షకుల ముందుకు మంచి హిట్ను ఖాతాలో వేసుకుంది. ఇక త్వరలోనే `గుర్తుందా శీతాకాలం`తో పలకరించబోతోంది.